chitika

Flag Counter

chitika

Search This Blog

Wednesday 28 January 2015

ARTICLE ABOUT THE LEGENDARY SAGE OF INDIA - SRI OURYA MAHARISHI SON OF APRAVANANA SON OF CHAVANYA SON OF BRUGUVU


ఔర్వ మహర్షి

భృగుని కుమారుడు చ్యవనుడు. చ్యవనుని పుత్రుడు అప్రవానుడు. అప్రవానునకు ఋచి అను భార్య వలన ఔర్వ మహర్షి జన్మించాడు. ఋచియూరువు మఋగున పుట్టినవాడగుటచే అతడు ఔర్వుడయ్యాడు. ఔర్వుడు చిన్నప్పటి నుంచి తపస్సులో ఉండేవాడు. ఆయన తపశ్చక్తి అనలముగా మారినది. ఆ అగ్ని వలన ఉపద్రవము కలుగునని అతని పిత్రుదేవతలు ఔర్వని చేరి “కుమారా నీ తపోశ్శక్తిచే జనించిన అగ్నిని సముద్రమున విడిచి పెట్టు, అది సముద్రమునుదహిస్తుంది. లేకపోతే ఉపద్రవములు కలుగును" అని చెప్పగా ఔర్వుడు దానిని సముద్రంలో వదిలి పెట్టాడు. అది ఔర్వానలమై గుఱ్ఱం ముఖంతో సముద్రజలమును త్రాగింది. అదే బడబానలం తర్వాత ఆయన బ్రహ్మచర్య దీక్ష చేయసాగాడు. అంత దేవతలు, రాక్షసులు ఆ మహర్షి వద్దకు వచ్చి పెళ్లి చేసుకొని పిల్లల్ని కనమని పలికారు. అందుకు అతడు ఒప్పుకోలేదు. ఔర్వని బ్రహ్మచర్య దీక్షకు ఆశ్చర్యపడి హిరణ్యకశిపుడు శ్రద్ధా భక్తులతో ఆ మహర్షికి నమస్కరించి శిష్యునిగా స్వీకరించమని కోరగా ఒప్పుకొని అతనికి వరాలు ఇచ్చి శత్రు భయం ఉండదని చెప్పిపంపాడు.

ఔర్వుడు తన తపో మహిమతో తనమోకాలి నుంచి ఒక కుమార్తెను సృష్టించాడు. ఆమెకు ‘కందని’ అని పేరు పెట్టి పెంచాడు. అమె అందముగా ఉండేది కాని కలహప్రియ. యుక్తవయస్సు వచ్చాక ఆమెను దుర్వాసమహర్షి కిచ్చి పెళ్లి చేశాడు. దూర్వాసుడు భార్యతో చక్కగా ఉంటున్నాడు కాని తనకే కోపం ఎక్కువ అనుకుంటే భార్య మరీ కోపిష్టి. కటువుగా మాట్లాడుతుంది. ఉన్న కొద్ది ఆమె బాధ భరించలేక మహర్షి ఆమెను భస్మం చేశాడు. ఆ సంగతి ఔర్వునికి తెలిసి వచ్చి అల్లుడ్ని నిందించి అవమానాల పాలు అవుతావని శపించాడు. అయోధ్యను భాషుడనే రాజు పాలిస్తూండగా వేరే రాజులు దండెత్తి వచ్చి రాజ్యమాక్రమించుకున్నారు. భాషుడు నిండు గర్భవతి పట్టమహిషి అయిన భార్యతో కలిసి ఔర్వుని ఆశ్రమంకు వెళ్లాడు. ఆయన ఇంకొక భార్య తనకు గర్భం రాలేదని పట్ట మహిషికి ఎవరికి తెలియకుండా విషం పెట్టింది. ఆ సంగతి ఎవరికీ తెలియదు. ఆ విషంతో గర్భం స్తంభన అయి ఏడు సంవత్సరములు అయిన పురుడు రాలేదు. ఈ లోపు రాజు మరణించాడు. పట్టమహిషి సహగమనంకు సిద్దపడటం వల్ల ఔర్వుడు అమెను వారించాడు.

ఆమె గురువు మాట విని ఉంది. కొంతకాలానికి ఆమెకు మగబిడ్డ కలిగాడు కాని విషంతో సహా పుట్టాడు. ఆ సంగతి తెలిసి ఔర్వుడు ఆ బిడ్డకు సగరుడని పేరు పెట్టాడు. తల్లీ కొడుకూ ఆశ్రమంనందే ఉండి సమస్త విద్యలు నేర్చుకొని తల్లివల్ల విషయాలు తెలుసుకొని శత్రువుల మీదకు దండెత్తి అందర్నీ జయించి రాజ్యం పరిపాలించుచున్నాడు. సుమతి, సుకేళి అను కన్యలను పెళ్లి చేసుకున్నాడు. వారి వల్ల సంతానం కలగలేదు. భార్యలను వెంటబెట్టుకొని ఔర్వ మహర్షి దగ్గరకు వచ్చి సంతానం కావాలని ప్రార్థించాడు. గురువు కరుణతో సుకేళికి ఒక కుమారుడు, సుమతికి అరవై మంది పుత్రులు పుట్టారు. సగరుడు సంతోషించి గురువుకు నమస్కరించి తన రాజ్యంకు వెళ్లాడు. సగరుడు చాలా కాలం రాజ్యం చేసి విసిగి గురువును తత్వ బోధన చేయమని అడిగాడు. అనేక విషయములు చెప్పారు. ఔర్వ మహర్షికి తెలియనివి లేవు మేధావి, తపోనిధి, అస్కలిత బ్రహ్మచారి, అందరికీ ఉపకారం చేసేవారు

LATEST CBAZAAR'S COLLECTION OF WOMEN KURTHIS







Only the most chic and elegant with our collection of ‪#‎kurtis‬ in modern tones made of ‪#‎georgette‬ and adorned with stylish patterns. 
Shop Now : http://www.cbazaar.com/colle…/haute-georgette-kurtis/sb.html
Price : Starts from USD $46

ARTICLE ABOUT MEMORY LOSS - CAUSES OF MEMORY LOSS - HOW TO DETECT MEMORY LOSS DEFECT - HOW TO OVERCOME MEMORY LOSS - ALL IN ONE ARTICLE ABOUT MEMORY LOSS


GLAMOUR SAREES BY INDIAN ACTRESS




GLAMOUR HOUSE WIFE YELLOW SAREE DESIGN


HOW ASTHAMA ATTACKS HUMANS - FACTS ABOUT ASTHAMA DISEASE / PROBLEM IN TELUGU


IMMEDIATELY SEND HIM TO EARTH


LATEST OPEN BACK BLOUSE DESIGN


LORD HANUMAN PRAYER - MANTRA BHALAM


MANO JAVAM MARUTHA THULYA VEGAM

JITHENDRIYAM BHUDHIMATHAM VARISHTHAM

VATHATHAMAJAM VANARAYUDHAMUKYAM

SRIRAMADHUTHAM SIRASA NAMAMI

LORD HANUMAN PRAYER AND MANTRA BHALAM

LOTUS MAZE ANDHRA KOLAM DESIGNS


WHAT THE TYPES OF GODS AVATHARS - ARTICLE ABOUT GOD AND HIS AVATHARS IN TELUGU


భగవంతుని అవతారాలు ఎన్ని విధాలు ?

అవతారాహ్య సంఖ్యాతా హరే స్సత్వ నిధేర్ద్విజాః |
యథా విదాసినః కుల్యాః సరసః స్యుః సహస్రశః ||

భక్తుల సంరక్షణకై భగవంతుడు తన సహజ స్వరూపాన్ని, స్థితిని మార్చుకొని దిగిరావడమే అవతారమంటే! ఆయా సందర్భాలలో ఆయా భక్తుల అవసరాలకి తగినట్లుగా ఆర్తిని తీర్చగలిగేట్టుగా తన వ్యూహం నుండి మనకోసం అనేక సార్లు అవతరించాడు స్వామి. శ్రీమద్భాగవతం భగవంతుని అవతారములు పది మాత్రమే కాదు అని, అవి 22 అని మూడవ అధ్యాయంలో, ఆపై అధ్యాయంలో 24 అని చెప్పి, ఆపై భగవంతుడి అవతారాలు అసంఖ్యాకములు అని తెలిపింది. నిరంతరం ప్రవహించే సరస్సు నుండి అనేక కాలువలు ఏర్పడుతున్నట్లుగానే అనంతమైన భగవత్తత్త్వము నుండి అనేకావతారములు ఆవిర్భవించుచున్నవి. అనగా భగవదవతారములు అపరిమితములు, అసంఖ్యేయములు అని తాత్పర్యం. అసలీ అవతారాలు ఎన్ని విధాలు ?

శ్రీమద్భాగవతంలో తాను నేరుగా వచ్చే అవతారములే కాక అనుప్రవేశ అవతారాన్ని చెబుతుంది. అంటే ప్రతిజీవిలోనూ భగవంతుడు తాను అనుప్రవేశించి ఉంటాడు. అలా ఉంటేనే ఆ జీవికి పేరు ఆకృతి ఏర్పడుతాయి. ఈ రూపంతోనే సురనరతిర్యక్ స్థావరాది సృష్టి అంతా జరిగింది. అలా కొందరు జీవుల ద్వారా కొన్ని కొన్ని కార్యాలు చేయిస్తుంటాడు. ఇది తెలుసుకొనిన జీవి తనని భగవంతుని పరికరమని భావించి ధర్మ సంస్థాపనాది భగవత్కార్యంలో అతిశయించి ప్రవర్తించగలుగుతారు. అట్లాంటి వారి గ్రంథాదులవలన, వారి చేష్టితముల వలన మహానుభావులని గుర్తించి దైవ స్వరూపులుగా ఆరాధిస్తున్నాం.

ఈ అవతారాలన్నింటినీ సూక్ష్మంగా ఆరు విధానాలుగా విభజించింది శ్రీగర్గ సంహిత.

1. పరిపూర్ణావతారము
2. పూర్ణావతారము
3. ఆవేశావతారము
4. కలావతారము
5. అంశావతారము
6. అంశాంశావతారము.

అంశాంశావతారము అంటే భగవదంశలో ఏకాస్తనో కలిగి ఉండేవి. పృథివిని గోవుగా మార్చి ఆయా జీవులకి కావల్సిన వాటిని ఇవ్వగలిగేట్టు చేసిన మహాప్రభువు పృథుచక్రవర్తి, నాభి అనే మనువు యొక్క కుమారుడైన ఋషభుడు మొదలగువారు ఈ అంశాంశావతారములే.

అంశావతారం అంటే భగవానునిలో ఉండే జ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సుల్లో ఏదో ఒక గుణ తీసుకొని ఏదో ఒక జీవి ద్వారా అనుప్రవేశించి కార్యాలు చేయడం. మంత్ర ద్రష్టలగు ఋషులు, ఇంద్రాది దేవతలు, ప్రజాపతులు మొదలగువారు అంశావతారములే.

కలావతారము అంటే తనలో ఉన్న కొన్ని కళలు తీసుకొని సాక్షాత్తుగ అవతరించి కార్యాలు చేయటం. ఆటంకాలు తొలగించటం కోసం క్షణంలోనే ఆవిర్భవించే అవతారం కలావతారం. మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన అవతారాలన్నీ కలావతారాలే.

ఆవేశావతారం అంటే స్వరూపాన్ని లేదా శక్తిని ఆవహింపజేసి ఒక జీవుని ద్వారా కార్యాన్ని నెరవేర్చడం. దుష్ట క్షత్రియులని ఏరిపారేయటానికి ఏర్పడిన పరశురామ అవతారం, వేదములని, వైదిక ధర్మాలను గ్రంథ రూపంలో భావితరాలకి అందించడానికి వ్యాస నారదాది ఋషులలో తన శక్తిని ఆవహింపజేసి ఆ పని పూర్తి అవగానే శక్తిని ఉపసంహరించుకున్నవి అన్నీ అవేశావతారాలే. బలరామ, కపిల అవతారాలు ఈ కోవలోకే వస్తాయి.

పూర్ణావతారము అంటే మానవునిగా ఉండటానికి అవసరమైన రసాలన్నింటినీ పోషించి కార్యాలు నెరవేర్చేది. నవరసభరితమైన శ్రీరామావతారము పూర్ణావతారము, ఇది సాక్షాత్తు భగవంతుడే అవతరించి లోక రక్షణ కావించిన అవతారం.

పరిపూర్ణావతారము పై అవతారాల లక్షణములే కాక భగవదసాధారణమైన జ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సులనే షడ్గుణ్య పూర్తి కలిగి ఉండేది. ఆయా సందర్భాల్లో ఆయా గుణములని ప్రకటించిన శ్రీకృష్ణావతారం పరిపూర్ణావతారం. షడ్గుణ్య పూర్తితో పాటు సౌలభ్య శౌశీల్య వాత్సల్యాది గుణములని పుండరీకాక్షత్వము మొదలైన దివ్య మంగళ విగ్రహ గుణములు పరిపూర్ణముగా ప్రకాశించిన అవతారమిది.

Wednesday 7 January 2015

BEAUTIFULLY DECORATED COLORFUL DAILY KOLAMS FOR PONGAL 2015



RICH WORK SAREES COLLECTION




DESIGNER SAREES FOR SANKRANTHI FESTIVAL 2015





DANCING WOMEN WITH DIYA DESIGNER KOLAM ART AND FLOWERS MUGGULU



FESTIVAL SAREES COLLECTION




FOUR FLOWERS COMBINATION DOTS RANGOLI


PONGAL FESTIVAL 2015 RICH EMBROIDARY WORK SAREES





PONGAL FESTIVAL BHAGALPURI SAREES COLLECTION






PONGAL FESTIVAL 2015 DAILY KOLAMS - BIRDS / HENS AND FLOWERS MUGGULU



LATEST 2015 PONGAL FESTIVAL SAREES




My Blog List

chitika